కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యవర్గాన్ని ప్రకటించింది. మెుత్తం 27 మంది ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను నియమించింది. పదవుల భర్తీలో విధేయత, సామాజిక న్యాయం, యువతకు ప్రాధాన్యతనిచ్చారు. ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్సీలకు పార్టీ పదవులు లభించాయి. కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఇంకా ప్రకటించాల్సి ఉంది.