తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించేందుకు రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ చర్యలను కఠినతరం చేసింది. దీనికోసం 33 జిల్లా స్థాయి బృందాలు, మూడు రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. తనిఖీలు చేపట్టి.. పది రోజుల్లో 4,748 కేసులు నమోదు చేసి 3,420 వాహనాలను సీజ్ చేశారు. ఓవర్ లోడ్ ప్రధాన సమస్యగా గుర్తించి.. రెండోసారి పట్టుబడితే వాహనం పర్మిట్, డ్రైవర్ లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయించారు. దీనిపై మైనింగ్ శాఖతో సమన్వయం చేసుకోనున్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.