వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతి-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలును నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ రైలు తిరుపతిలో సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. దీనికి 30 శాతం అదనపు ఛార్జీ ఉంటుంది. ఆన్లైన్ , కౌంటర్లలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్ విజయవాడ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మీదుగా వెళ్తుంది. మిగతా రైళ్లలాగే ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.