Karimnagar Medak Nizamabad Adilabad Graduate MLC Election: తెలంగాణలో రేపు (ఫిబ్రవరి 27) ఉమ్మడి కరీంనగర్- మెదక్- ఆదిలాబాద్- నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నిక కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా.. పట్టభద్రులు కూడా ఓటేసేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ తీరు.. మిగతా ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అసలు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో పోలింగ్ విధానం ఎలా ఉంటుంది... ఓటు ఎలా వేయాలి.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలపై ఓ లుక్కేయండి.