టీటీడీకి మరో భారీ విరాళం అందింది. బెంగళూరుకు చందిన సుయుగ్ వెంచర్స్ అనే సంస్థ టీటీడీకి రూ.1.50 కోట్లు విరాళంగా అందించింది. సుయుగ్ వెంచర్స్ ఛైర్మన్ యతీష్ సూరినేని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ఈ విరాళం అందించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి ఆయన చేతికి ఈ విరాళం అందించారు. మరోవైపు తిరుపతిలోని కోదండరామాలయంలో శనివారం పుష్పయాగం ఘనంగా జరిగింది. మూడు టన్నుల పూవులతో స్వామివారికి అత్యంత వైభవంగా పుష్పయాగం నిర్వహించారు.