టీటీడీకి మరో భారీ విరాళం అందింది. తమిళనాడులోని చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు టీటీడీకి భారీ విరాళం అందించారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టు, ప్రాణదాన ట్రస్టుకు రూ.1.01 కోట్లు చొప్పున.. రూ.2.02 కోట్లు విరాళంగా అందించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి విరాళం తాలూకు చెక్ అందజేశారు. ఈ సందర్భంగా విరాళం అందించిన భక్తుడిని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అభినందించారు. అటు తిరుమలలో తొలిసారిగా శ్రీమన్నారాయణీయ సహస్ర గళార్చన కార్యక్రమం నిర్వహించారు.