తిరుమల తిరుపతి దేవస్థానానికి మరో భారీ విరాళం అందింది. చెన్నైకు చెందిన కంపెనీ టీటీడీకి భారీ విరాళం అందించింది. చెన్నైకు చెందిన పొన్ ప్యూర్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం అందించింది. టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరిని కలిసి విరాళం తాలుకు చెక్కును కంపెనీ ఎండీ అందించారు, మరోవైపు వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. శనివారం శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు సమయం పట్టింది.