తిరుమల తిరుపతి దేవస్థానానికి మరో భారీ విరాళం అందింది. విజయవాడకు చెందిన మోనిష్ వెంకట సత్యప్రకాష్ అనే భక్తుడు టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా అందించారు. దాత తరుపున ప్రతినిధి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును శుక్రవారం కలిసి విరాళానికి సంబంధించిన డీడీని అందించారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దాతను అభినందించారు. మరోవైపు వేద విద్యార్థులకు శుక్రవారం టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి వస్త్రాలను పంపిణీ చేశారు.