టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం ఆయనను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అనిల్ కుమార్ సింఘాల్ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే అనిల్ కుమార్ సింఘాల్ బదిలీకి తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసే కారణమని తెలుస్తోంది.