Srivani Ticket Counter Change In Tirumala: తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా టికెట్లు జారీ చేసే కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జే శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ ఈవో స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. ఆ వెంటనే.. దీని స్థానంలో డీఎఫ్వో కార్యాలయంలో శాశ్వత ప్రాతిపదికన టికెట్ల జారీ కౌంటర్లు.. 200 మంది భక్తులు వేచి ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.