తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అద్బుత అవకాశం కల్పిస్తోంది. తిరుమలలో నిత్యాన్నదానం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీవారి భక్తులకు అన్నదానం చేయాలనుకునే వారికి టీటీడీ అద్భుత అవకాశం ఇస్తోంది. తిరుమలలో అన్నదానం చేయాలనుకునే వారి కోసం టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించింది. రూ.44 లక్షలు విరాళంగా అందిస్తే ఒక రోజు అన్నదానం చేసే అవకాశం కల్పిస్తోంది. అలాగే దాతల పేర్లను కూడా వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ప్రదర్శిస్తారు.