తిరుమల తిరుపతి దేవస్థానానికి మరోసారి భారీ విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన నాగరాజు అనే భక్తుడు టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు పది లక్షలు విరాళంగా అందించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతికి విరాళం డీడీని అందించారు. మరోవైపు పంద్రాగస్టు సందర్భంగా తిరుపతిలోని టీటీడీ ఆఫీస్ వద్ద స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు . జాతీయ జెండాను ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు గౌరవ వందనం స్వీకరించారు.