కాకినాడ జిల్లాలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీ వీడటం లేదు. చిన్నారి కనిపించకుండా పోయి పది రోజులైంది. చిన్నారి కోసం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. అయినా కూడా పాప ఆచూకీ తెలియడం లేదు. ఈ కేసులో కీలక ఆధారంగా ఉన్న పెంపుడు కుక్క కూడా చనిపోవటం పోలీసులకు సవాలుగా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా కొంతమంది పెడుతున్న కామెంట్లు, వీడియోలు.. తమ ధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని పాప తల్లి భవానీ వాపోయారు. దయచేసి అలాంటి కామెంట్లు పెట్టొద్దంటూ వేడుకున్నారు.