మాచర్ల మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత తురకా కిషోర్ జైలు నుంచి విడుదల అయ్యారు. అతనిపై నమోదైన పలు కేసులలో బెయిల్ రావటంతో శుక్రవారం సాయంత్రం గుంటూరు జైలు నుంచి రిలీజయ్యారు. అనంతరం మాట్లాడిన తురకా కిషోర్.. ప్రభుత్వం కక్షపూరితంగానే తనను అరెస్ట్ చేసి 215 రోజులు జైలులో ఉంచిందని ఆరోపించారు. తనకు అండగా నిలిచినందుకు జగన్కు ధన్యవాదాలు తెలియజేశారు.