తిరుమలలోని శ్రీవారి ఆలయంలో ఏటా ఉగాది పండుగ ఘనంగా జరుపుతారు. ఆనందనిలయంలో పండుగను సాంప్రదాయంగా నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో జరిగే ఈ వేడుకను ‘ఉగాది ఆస్థానం’ అని పిలుస్తారు. ఉగాది నుంచి శ్రీనివాసుడికి ఉత్సవాలు, ఊరేగింపులు మొదలై మళ్లీ ఉగాదికి పూర్తవుతాయి. వేంకటేశ్వరుడు కూడా పంచాంగం వింటాడు. ముందుగా బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా శ్రీదేవి భూధేవి సమేత సస్వామివారిని వేంపుచేసి.. అనంతరం ఆస్థాన సిద్ధాంతి పంచాంగం శ్రవణం చేస్తారు.