Urea Shortage: ఏపీ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తక్షణమే 10 వేల మెట్రిక్ టన్నుల యూరియాను అందించేందుకు ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ తొలి వారంలో మరో 30 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. ఇక ఈ విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా యూరియా లేక.. రైతులు తీవ్ర అవస్థలు పడుతుండగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం యూరియా రిలీజ్ చేయడంతో భారీ ఉపశమనం లభించింది.