ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉర్సా క్లస్టర్కు విశాఖలో 60 ఎకరాల భూమిని కేటాయించడం వివాదాస్పదమైంది. ఎకరా 99 పైసలకే ఇచ్చారంటూ ఆరోపణలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, ఉర్సా క్లస్టర్ మాత్రం ఎకరా కోటి రూపాయల చొప్పున 3.5 ఎకరాలు, ఎకరా 50 లక్షల చొప్పున మిగిలిన భూమిని తీసుకున్నామని తెలిపింది. దీనిపై అనుమానాలు నివృత్తి చేసేందుకు జూమ్ కాల్ నిర్వహించగా, మరిన్ని ప్రశ్నలు తలెత్తాయని నెటిజన్లు అంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం..