Guntur Student Deepthi Died In Texas: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న గుంటూరుకు చెందిన వంగవోలు దీప్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. టెక్సాస్లో చదువుతున్న ఆమె మరో నెలలో స్వదేశానికి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది. స్నేహితురాలితో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహాయంతో ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.