గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. విజయవాడ సబ్ జైలులో ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే శనివారం వల్లభనేని వంశీ మోహన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు వెంటనే ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు రెండు గంటల పాటు వల్లభనేని వంశీకి పలు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిసింది. అనంతరం వల్లభనేని వంశీని తిరిగి విజయవాడ సబ్ జైలుకు తరలించారు.