Ap Free Bus Scheme Stree Shakti: ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్యంపై దృష్టి సారించాలని, రాజకీయ ప్రయోజనాల కోసం ఉచితాలు ఇవ్వడం సరికాదని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, చట్టబద్ధతకు ఆయన పలు సూచనలు చేశారు.