వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. స్టోన్ క్రషర్స్ యజమానులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విడదల రజిని మరిది గోపిని ఏసీబీ అరెస్ట్ కూడా చేసింది. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ విడదల రజిని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఏపీ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.