Vidadala Rajini: మాట్లాడేముందు జాగ్రత్త.. లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్..

11 months ago 15
మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజినీ చేసిన ఆరోపణలపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పందించారు. 40 ఏళ్ల నుంచి విద్యాసంస్థలు నడుపుతున్న తాము ఏరోజూ భూములు కావాలని అడగలేదని స్పష్టం చేశారు. దిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడిన లావు శ్రీకృష్ణదేవరాయలు.. విడదల రజినీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. క్రషర్‌ యజమానులను భయపెట్టిన అంశంలో విడదల రజిని కేసులు ఎదుర్కొంటున్నారన్న ఆయన.. మీ ఒత్తిడితోనే వారిపై భారీగా జరిమానా వేయబోయారనేది నిజం కాదా అని ప్రశ్నించారు. ఒకరిని విమర్శించేముందు నిజాలు తెలుసుకోవాలని సూచించిన టీడీపీ ఎంపీ.. నిజాలు తెలియకుండా మాట్లాడితే నవ్వులపాలవుతారని అన్నారు. ఫోన్‌ డేటా, భూముల విషయాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు.
Read Entire Article