ఓ కానిస్టేబుల్ అప్రమత్తత.. ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. ఈ ఘటన విజయవాడ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. చర్లపల్లి - షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రైలు కదులుతున్న సమయంలో ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు.. జారి పడబోయాడు. అయితే ఈ విషయాన్ని అక్కడే ఉన్న కానిస్టేబుల్ గుర్తించి వెంటనే అతన్ని రక్షించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వివరాలను ఎక్స్ వేదికగా షేర్ చేసిన దక్షిణ మధ్య రైల్వే కానిస్టేబుల్ను ప్రశంసించింది. ప్రయాణికులకు సూచనలు చేసింది.