Vijayawada: దుర్గ గుడికి వచ్చిన సరుకులు వెనక్కి.. పదిరోజుల్లో ఇది మూడోసారి..!

8 months ago 10
తిరుపతి లడ్డూ వ్యవహారం తర్వాత ఆలయాల్లో ప్రసాదాలపై పర్యవేక్షణ పెరిగింది. ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడి సరుకుల నాణ్యతను పరిశీలించిన తర్వాతనే ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్నారు. నాణ్యతలో ఏ మాత్రం తేడా కనిపించినా.. తిరస్కరిస్తున్నారు. తాజా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నాణ్యత సరిగా లేకపోవటంతో కిస్మిస్‌లను వెనక్కి పంపారు. శనివారం తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నాణ్యత సరిగా లేవనే కారణంతో 200 బాక్సుల కిస్మిస్‌లు వెనక్కి పంపారు. అయితే గత పదిరోజుల్లో ఇలా సరుకులను వెనక్కి పంపడం ఇది మూడోసారి.
Read Entire Article