విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షల విరమణ కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హోమగుండాలు, షెడ్లు, షవర్లు ఏర్పాటు చేశారు. తాజాగా భవానీ దీక్షల విరమణ కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ మొబైల్ అప్లికేషన్ విడుదల చేశారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భవానీ భక్తులు ఈ యాప్ ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. దర్శనం, క్యూలైన్లు, లడ్డూ కౌంటర్లు అన్ని వివరాలు ఇందులో ఉన్నాయని వివరించారు.