Vijayawada: రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మువ్వన్నెల జెండాను ఎగురవేసేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలో రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆయా రూట్లలో ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. ఆర్టీసీ బస్సులను కూడా దారి మళ్లిస్తున్నారు. ఆ మార్గాల్లో వెళ్లేవారు తమ రూట్ను మార్చుకోవాలని బెజవాడ పోలీసులు.. సూచిస్తున్నారు.