వాహనదారులకు అలర్ట్.. విజయవాడలో రెండు కొత్త టోల్ ప్లాజాలు అందుబాటులోకి వచ్చాయి. వెదురుపావులూరు, వెంకటపాలెం టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజుల వసూలును జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించింది. దీంతో పొట్టిపాడు టోల్ ప్లాజా మూసివేయనున్నారు. అలాగే వెంకటపాలెం టోల్ ప్లాజా అందుబాటులోకి రావటంతో వాహనదారులకు.. కాజ టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు తగ్గనుంది.