యావత్ భారతావని వినాయక చవితి వేడుకలకు సిద్ధమవుతోంది. విగ్రహాల ఏర్పాటు కోసం ముందస్తు ప్రణాళికలు రచించుకుంటున్నారు యువత. దీంతో కాలనీల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కీలక సూచనలు చేసింది. మట్టి గణపతులనే పూజించాలని జీవీఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు. అలాగే వినాయక చవితి సందర్భంగా అనుమతులు మంజూరు చేసేందుకు సింగిల్ విండో క్లియరెన్స్ సెల్ ఏర్పాటు చేశారు.