తమిళనాడులోని హోసూరులో ఆంధ్ర సాంస్కృతిక సమితి శ్రీరామ నవమి వేడుకలకు తెలుగులో ఆహ్వాన పత్రికను ముద్రించింది. ఏప్రిల్ 6, 2025న మధ్యాహ్నం 2 గంటలకు సమితి భవనంలో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో ప్రత్యేక పూజలు, ప్రసాద వితరణ .. ప్రముఖ కళాకారులచే రామాయణ గానామృతం ఉంటాయి. తెలుగు భాషాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నారు. ఈ పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.