Visakhapatnam Kailasagiri New Ropeway: విశాఖపట్నంలో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు కైలాసగిరి రోప్వేను ఆధునీకరించాలని వీఎంఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న రోప్వే స్థానంలో కొత్త రోప్వేతో పాటు లూజ్ గ్రావిటీ రైడ్ను ఏర్పాటు చేయాలని భావించారు. అయితే, ప్రాజెక్టు వ్యయం ఎక్కువగా ఉండటంతో టెండర్లు ఆశించిన స్థాయిలో రాలేదు. ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించి, మళ్లీ టెండర్ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్ుంది.