Andhra Pradesh Cii Partnership Summit 2025 Vizag: విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నాయి. మొత్తం 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఒకరోజు ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు 15 సమావేశాల్లో పాల్గొని ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. అయితే సదస్సుకు ముందుగానే రూ.3.65 లక్షల కోట్ల విలువైన 35 అవగాహన ఒప్పందాలు జరిగాయని చెబుతున్నారు. ఈ రెండు రోజులు మరిన్ని ఒప్పందాలు జరుగుతాయని చెబుతున్నారు.