విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. 9 నెలల నిండు చూలాలిని హత్య చేశాడు ఓ భర్త. డెలివరీ దగ్గర పడిన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. మధురవాడ ఆర్టీసీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనూష అనే గర్భవతిని భర్త జ్ఞానేశ్వర్ హత్య చేెశాడు. ప్రస్తుతం జ్ఞానేశ్వర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు విశాఖపట్నం పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే అనూషను వదిలించుకునేందుకే హత్య చేసినట్లు ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.