Vizag: బిగ్ అలర్ట్.. కొత్త ఏడాదిలో కొత్త రూల్.. పాటించకపోతే జేబుకు చిల్లే

1 year ago 27
వైజాగ్‌వాసులకు ముఖ్య గమనిక. వచ్చే ఏడాది ఆరంభం నుంచి విశాఖలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద పూర్తిస్థాయిలో నిషేధం అమల్లోకి రానుంది. జనవరి 1, 2025 నుంచి విశాఖపట్నంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద పూర్తి స్థాయిలో నిషేధం అమలు చేయనున్నట్లు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. దీనిపై ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది. జనవరి ఒకటి నుంచి ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తామని జీవీఎంసీ స్పష్టం చేసింది. విశాఖను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని కోరింది.
Read Entire Article