Vizag: వీడియోలు చూపి బెదిరించి.. లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం..

1 year ago 37
ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నంలో ఓ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి.. ఆ వీడియోలు చూపించి బెదిరిస్తూ నిందితులు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో వేధింపులు భరించలేక బాధితురాలు ఆత్మహత్యకు యత్నించగా.. కుటుంబసభ్యులు గుర్తించడంతో ప్రాణాలతో బయటపడింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు విశాఖపట్నం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Entire Article