Vizianagaram MLC: మధ్యాహ్నం వైసీపీ అభ్యర్థి ప్రకటన.. సాయంత్రానికి హైకోర్టు ట్విస్ట్

1 year ago 18
విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ తిరిగింది. ఇందుకూరి రఘురాజు అనర్హత ఉత్తర్వులను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. రఘురాజు వాదనలు వినకుండానే మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారన్న హైకోర్టు.. అనర్హత ఉత్తర్వులు రద్దు చేసింది. మరోసారి ఈ విషయాన్ని పరిశీలించాలని మండలి ఛైర్మన్ వద్దకు ఈ వ్యవహారాన్ని పంపింది. అప్పటి వరకూ రఘురాజు ఎమ్మెల్సీ సభ్యత్వం పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఈ నెలాఖర్లో జరగాల్సిన విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి.
Read Entire Article