తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో భక్తులకు నిత్యాన్నదానం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం రూ.4.35 కోట్లు కేటాయించగా, ఆగస్టు నుంచి అన్నప్రసాద వితరణ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తిరుమల తరహాలో ఇక్కడ కూడా నిరంతరాయంగా భక్తులకు అన్నదానం అందించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.