AndhraPradesh Rains: ఏపీలోని మూడు జిల్లాల్లో కొన్ని గంటల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మన్యం. శ్రీకాకుళం , విజయనగరం జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. పిడుగులు పడే సమయంలో పొలాల్లో పనిచేసే కూలీలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.