ఆంధ్రప్రదేశ్లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో నాలుగు రోజులు కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. మిగతా చోట్ల తేలికపాటి వర్షం కురుస్తుందని వెల్లడించింది. పిడుగులతో కూడిన వానల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు గుంటూరులో ఆదివారం భారీ వర్షం దంచికొట్టింది. క్లౌడ్ బరస్ట్ తరహాలో బీభత్సం సృష్టించింది.