ఏపీని తుపాను ముప్పు భయపెడుతోంది. మొంథా తుపాను దూసుకువస్తోంది. ఈ తుపాను తీవ్ర తుపానుగా మారి అక్టోబర్ 28వ తేదీ మంగళవారం సాయంత్రం లేదా రాత్రి కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ఈ తీవ్ర తుపాను ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను నేపథ్యంలో ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తీవ్ర తుపాను నేపథ్యంలో అక్టోబర్ 28, 29 రోజులలో తీర ప్రాంత జిల్లాల్లో సెలవులు ఇస్తే మంచిదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.