Andhra Pradesh Weather Update: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో రేపటి నుంచి వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. దిత్వా తుఫాను ప్రభావంతో శనివారం, ఆదివారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. శనివారం తిరుపతి, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.