ఏపీవాసులకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడనుందని.. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చని అంచనా వేసింది.