ఏపీని మరోసారి వరుణుడు పలకరించనున్నాడు. వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మూడు రోజుల పాటు పల్నాడు, రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ఫ్రఖర్ జైన్ వెల్లడించారు. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.