ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలర్ట్.. వచ్చే రెండు రోజులు ఏపీలో కొన్నిచోట్ల వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.