వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరులో పర్యటించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్.. దాడిలో ధ్వంసమైన ఇంటిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల నెయ్యిలో కల్తీ జరగలేదని కేంద్ర సంస్థల నివేదికలే చెప్పాయని వైఎస్ జగన్ అన్నారు. తప్పు జరిగి ఉంటే భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పేర్లు సీబీఐ ఛార్జ్ షీట్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదని.. తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.