Ys Jagan Mohan Reddy: నేను ఆరోజే చెప్పాను.. మీరే వినలేదు

10 months ago 20
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల సొమ్మంతా ఏమవుతోందని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్. జగన్‌ ఉన్నపుడు బటన్‌ నొక్కి ప్రజలకు నేరుగా ఇచ్చేవాడని.. కానీ ఇప్పుడు అప్పుల సొమ్ము, రాష్ట్ర ఆదాయం చంద్రబాబు జేబుల్లోకి వెళుతున్నందువల్లే హామీలను అమలు చేయడం లేదన్నారు. సూపర్‌-6 గాలికొదిలేశారని.. కరెంట్‌ బిల్లులు షాక్‌ కొట్టేలా పెరిగిపోయాయన్నారు. అవినీతి విచ్చలవిడి అయ్యిందని.. ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి నీకింత, నాకింత అని దోచుకునే పరిస్థితి ఉందన్నారు. వీటన్నింటిపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతకు సమాధానం చెప్పలేకనే రోజుకో డైవర్షన్‌ అంశాన్ని తెరపైకి తెస్తున్నారన్నారు.. తిరుమల లడ్డూలో కల్తీ అని ఇంకోటని, ఐపీఎస్‌ అధికారి అరెస్టు, మద్యం కుంభకోణమంటూ రోజుకొక డైవర్షన్‌ డ్రామా చేస్తున్నారని విమర్శించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అణగదొక్కడం అంత సులభం కాదన్నారు.
Read Entire Article