ఏపీలో తల్లికి వందనం పథకం వెంటనే అమలు చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాదీవెన, వసతిదీవెన నిధులను విడుదల చేయడం లేదని.. వీటిని బకాయిలు పెట్టడంతో విద్యార్థులకు ఇబ్బందులు వస్తున్నాయని వైఎస్ జగన్ విమర్శించారు. ఫీజులు కట్టకపోవటంతో విద్యార్థులు చదువు మానేసి పనులకు వెళ్లాల్సి వస్తోందని ఆరోపించారు. తల్లికి వందనం పథకంతో పాటుగా.. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలంటూ వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.