YS Jagan: చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరాయి: వైఎస్ జగన్

2 weeks ago 7
చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. P-4 అనే కొత్త మోసాన్ని మొదలుపెట్టారని.. సమాజంలో ఉన్న 20శాతం పేదవాళ్ల బాగోగులకు 10శాతం మందికి అప్పగిస్తారట అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డులు ఎన్ని ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 1.61 కోట్ల కుటుంబాలు ఉంటే అందులో 1.48శాతం కుటుంబాలకు మాత్రమే తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నాయని తెలిపారు. వీరంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇన్‌కం ట్యాక్స్‌ కట్టేవారు ఎంతమంది ఉన్నారో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 8.6 లక్షల మంది ఇన్‌కమ్ ట్యాక్స్‌ కడుతున్నారు. ఆయన చెప్పిన ప్రకారం.. ఈ 1.48 కోట్ల మంది కుటుంబాలను 8.6 లక్షల మందికి అప్పగించాలి కదా?. ఇన్ని రకాలుగా చంద్రబాబు మోసాలు చేస్తారని జగన్ తెలిపారు.
Read Entire Article