Gulakarai Case Satish Kumar Found In Kadapa: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు వేముల సతీష్ కుమార్ కడపలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు మందలించడంతోనే సతీష్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని లాయర్ సలీమ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్పై రాయి దాడి జరగడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ కేసుతో తనకు సంబంధం లేదని సతీష్ ఆరోపించాడు. బెయిల్పై విడుదలైన సతీష్, ఆ తరువాత కనిపించకుండా పోయాడు. పోలీసులు అతడి ఆచూకీ కనుగొనడంతో ఊపిరి పీల్చుకున్నారు.