వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎమోషనల్ అయ్యారు. తన స్నేహితుడిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగపు ట్వీట్ చేశారు. మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయనను గుర్తుచేసుకుంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. పుట్టిన రోజు సందర్భంగా మేకపాటి గౌతమ్ రెడ్డిని మనసారా గుర్తు చేసుకుంటున్నానని.. మిస్ యూ అంటూ వైఎస్ జగన్ ట్వీ్ట్ చేశారు. మరోవైపు మేకపాటి గౌతమ్ రెడ్డి 2022లో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. మేకపాటి గౌతమ్ రెడ్డి పుట్టినరోజు కావటంతో ఆయన అభిమానులు, కుటుంబసభ్యులు, సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు.