వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు ఉపశమనం కల్పించింది. వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15 మధ్యన రెండు వారాల పాటు వైఎస్ జగన్ యూకే, యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. లక్ష రూపాయల విలువైన పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది.